అందరికీ నా నమస్కారం. మనిషికి జంతువుకి భగవంతుడు పెట్టిన తేడా ఆలోచనే. మనకి ఊహ వచ్చిన దగ్గరినుండి ఎన్నో ఆలోచనలు చేసి ఉంటాం. పుట్టిన దగ్గరి నుండి చనిపోయే వరకు మనం ఆలోచిస్తూనే ఉంటాం. నిజానికి మరణం అంటే గుండె ఆగిపోవడం కాదు, మన ఆలోచన ఆగిపోవడం. "నా ఇష్టం" లో రామ్ గోపాల్ వర్మ అంటాడు " నేను అంటే నా ఆలోచనే. నేను చిన్నప్పటి నుండి చూసిన సంఘటనలు, మనుషులు, వాళ్ళ ఆలోచనలు అన్నీ కలిపితేనే నేను". ఒక మనిషిగా మనం ఆలోచించగలిగిన పరిధి చాలా తక్కువ ఉంటుంది. వేరే వాళ్ళ ఆలోచనలను కూడా చదివినప్పుడు, మన ఆలోచనలను వాళ్ళతో పంచగలిగినప్పుడు మాత్రమే ప్రతి వ్యక్తి ఒక్క ఆలోచనా పరిధీ విస్తృతం అవుతుంది. ఇదివరకు పుస్తకాలు ఈ పని చేసి పెట్టేవి.ఇపుడు నేను పుస్తకం రాస్తే అచ్చు వేసే వాడు ఎవడూ దొరకడు అని నమ్ముతూ ఈ బ్లాగుని ప్రారంభిస్తున్నాను. నా ఆలోచనలని చదవండి, మీ ఆలోచనలని కూడా నాతో పంచండి.
No comments:
Post a Comment